Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 AM

వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్‌పీఆర్‌డీ

వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్‌పీఆర్‌డీ
February 22, 2026 06:06 PM 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పులికొండ మండలం నాగారం గ్రామంలో ఎన్‌పీఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6000 పెన్షన్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 25న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News