PRINT TIME: July 11, 2026 02:39 PM
వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్పీఆర్డీ
వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్పీఆర్డీ
February 22, 2026 06:06 PM
110 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
పులికొండ మండలం నాగారం గ్రామంలో ఎన్పీఆర్డీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6000 పెన్షన్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 25న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి