Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 05:19 PM

విద్యారంగానికి అంకితమైన జీవితం… ప్రొఫెసర్ ముప్పా నరసింహారెడ్డి

విద్యారంగానికి అంకితమైన జీవితం… ప్రొఫెసర్ ముప్పా నరసింహారెడ్డి

విద్యారంగానికి అంకితమైన జీవితం… ప్రొఫెసర్ ముప్పా నరసింహారెడ్డి
January 12, 2026 06:53 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

చిట్యాల పట్టణం గర్వించదగ్గ విద్యావేత్త, భూవిజ్ఞాన రంగంలో తనదైన ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ ముప్పా నరసింహారెడ్డి. ఇటీవల అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందడం విద్యా, పరిశోధనా రంగాలకు తీరని లోటుగా మారింది. వినయంతో కూడిన వ్యక్తిత్వం, విద్యార్థులపై అపారమైన ప్రేమ, పరిశోధనపై అంకితభావం ఆయన జీవన సారాంశం.1990 నుంచి 2001 వరకు భూవిజ్ఞాన విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించిన ఎం.ఎన్. రెడ్డి, విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా పరిశోధన వైపు నడిపించారు. ఎనిమిది మంది పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి, వారు ఉన్నతస్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. జాతీయస్థాయి పరిశోధనా ప్రాజెక్టుల్లో ఆయన చేసిన సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.భారతీయ విశ్వవిద్యాలయాల తరఫున 8వ భారతీయ అంటార్కిటిక శాస్త్రయాత్రలో ఏకైక ప్రతినిధిగా పాల్గొనడం ఆయన జీవితంలోని అత్యంత గౌరవప్రదమైన ఘట్టం. అక్కడ ఆయన చూపిన ప్రతిభ, నిబద్ధతకు గుర్తింపుగా విశేష ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇది ఆయన శాస్త్రీయ జీవితానికి కిరీటంలాంటి ఘనతగా నిలిచింది.అదేవిధంగా ఢిల్లీ ఐఐటి గవర్నింగ్ బాడీ సభ్యుడిగా సేవలందిస్తూ, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. విద్య అనేది ఉద్యోగ సాధనకే కాకుండా సమాజ నిర్మాణానికి ఆయుధమని ఆయన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆచరణలో చూపించిన మహనీయుడు ఎం.ఎన్. రెడ్డి.సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలు, విద్యార్థుల విజయంలో తన విజయాన్ని చూసుకునే హృదయం ఆయన ప్రత్యేకత. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, విద్యారంగంలో ఆయన వెలిగించిన దీపం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News