Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:56 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.డాక్టర్ అజయ్ కుమార్

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.డాక్టర్ అజయ్ కుమార్

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.డాక్టర్ అజయ్ కుమార్
February 05, 2026 03:58 PM 198 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరిక

రామన్నపేట, ఫిబ్రవరి 5:

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని ఓపీ విభాగం, వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కమిషనర్, అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.వైద్యులతో సమావేశమై ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందిస్తున్న మందులపై ఆరా తీసి, ఔషధ నిల్వలను పరిశీలించారు. అత్యవసర మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు కమిషనర్‌ను కలిసి ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనాన్ని మంజూరు చేయాలని, ఆసుపత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని కోరారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని డాక్టర్ అజయ్ కుమార్ వారికి తెలిపారు.ఈ తనిఖీల్లో డీసీహెచ్ఎస్ చిన్నా నాయక్, వైద్యులు స్వాతి బాయి, నవీన్ సింగ్, మాధవచారి, దేవేందర్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News