వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్కు వినతి
వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్కు వినతి
Editor Desk
వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్తో పాటు అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, క్రిస్టిన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను కార్పొరేటర్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రహదారులు అధ్వానంగా మారడం, డ్రైనేజీ సరిగా పనిచేయక వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, పాడైపోయిన రహదారుల మరమ్మతులు చేపట్టడం అత్యవసరమని కోరారు. ప్రజలకు సంబంధించిన ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశాలపై జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి