Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:23 PM

వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్‌కు వినతి

వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్‌కు వినతి

వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్‌కు వినతి
February 05, 2026 07:20 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్‌తో పాటు అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, క్రిస్టిన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను కార్పొరేటర్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రహదారులు అధ్వానంగా మారడం, డ్రైనేజీ సరిగా పనిచేయక వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, పాడైపోయిన రహదారుల మరమ్మతులు చేపట్టడం అత్యవసరమని కోరారు. ప్రజలకు సంబంధించిన ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశాలపై జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News