Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు
06-01-2026 317 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశాఖపట్నం సానిక ప్రతినిధి

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు హాజరైన ఈ సభలో తెలంగాణ నుంచి రామన్నపేట మండలానికి చెందిన నాయకులు విశేషంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ మహాసభల్లో రామన్నపేట మండలానికి చెందిన కల్లూరి మల్లేశం గారు నూతనంగా సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. ఇది మండల కార్మిక ఉద్యమానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే సోములు, సీఐటీయూ మండల నాయకులు మునికుంట్ల లెనిన్, గొరిగె ధనుష్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటారు.

కార్మికుల జీవన భద్రత, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు స్పష్టమైన సందేశం ఇచ్చాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

Sthanikam

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

Article Image

విశాఖపట్నం సానిక ప్రతినిధి

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు హాజరైన ఈ సభలో తెలంగాణ నుంచి రామన్నపేట మండలానికి చెందిన నాయకులు విశేషంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ మహాసభల్లో రామన్నపేట మండలానికి చెందిన కల్లూరి మల్లేశం గారు నూతనంగా సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. ఇది మండల కార్మిక ఉద్యమానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే సోములు, సీఐటీయూ మండల నాయకులు మునికుంట్ల లెనిన్, గొరిగె ధనుష్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటారు.

కార్మికుల జీవన భద్రత, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు స్పష్టమైన సందేశం ఇచ్చాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News