Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు
January 06, 2026 10:47 AM 297 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశాఖపట్నం సానిక ప్రతినిధి

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు హాజరైన ఈ సభలో తెలంగాణ నుంచి రామన్నపేట మండలానికి చెందిన నాయకులు విశేషంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ మహాసభల్లో రామన్నపేట మండలానికి చెందిన కల్లూరి మల్లేశం గారు నూతనంగా సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. ఇది మండల కార్మిక ఉద్యమానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే సోములు, సీఐటీయూ మండల నాయకులు మునికుంట్ల లెనిన్, గొరిగె ధనుష్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటారు.

కార్మికుల జీవన భద్రత, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు స్పష్టమైన సందేశం ఇచ్చాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News