విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు
విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు
స్థానికం బృందం
విశాఖపట్నం సానిక ప్రతినిధి
విశాఖపట్నంలో నిర్వహించిన సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు హాజరైన ఈ సభలో తెలంగాణ నుంచి రామన్నపేట మండలానికి చెందిన నాయకులు విశేషంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ మహాసభల్లో రామన్నపేట మండలానికి చెందిన కల్లూరి మల్లేశం గారు నూతనంగా సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. ఇది మండల కార్మిక ఉద్యమానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే సోములు, సీఐటీయూ మండల నాయకులు మునికుంట్ల లెనిన్, గొరిగె ధనుష్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటారు.
కార్మికుల జీవన భద్రత, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు స్పష్టమైన సందేశం ఇచ్చాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి