Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
04-01-2026 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనాయకుడు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు సృష్టిస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు.అలాగే ఆదోని జిల్లా ఏర్పాటుపై కూడా ప్రభుత్వ స్థాయిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, జేపీ వెంకటేష్ లోకేష్ పాల్గొన్నారు.

Sthanikam

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Article Image
స్థానిక ప్రతినిధి

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనాయకుడు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు సృష్టిస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు.అలాగే ఆదోని జిల్లా ఏర్పాటుపై కూడా ప్రభుత్వ స్థాయిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, జేపీ వెంకటేష్ లోకేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News