విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
స్థానికం బృందం
స్థానిక ప్రతినిధి
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనాయకుడు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు సృష్టిస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు.అలాగే ఆదోని జిల్లా ఏర్పాటుపై కూడా ప్రభుత్వ స్థాయిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, జేపీ వెంకటేష్ లోకేష్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి