Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
January 04, 2026 08:33 PM 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనాయకుడు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు సృష్టిస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు.అలాగే ఆదోని జిల్లా ఏర్పాటుపై కూడా ప్రభుత్వ స్థాయిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, జేపీ వెంకటేష్ లోకేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News