స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అస్టెంట్గా పనిచేస్తున్న గాలయ్య 26 జనవరి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగి సేవ అవార్డు ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం, మండల తహసీల్దార్ కార్యాలయంలో MRPS నాయకులు గాలయ్య కి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు నోముల ప్రవీణ్, నోముల విష్ణు, పెరుమాండ్ల నవీన్, సుర్వి సతీష్ గౌడ్, చిప్పలపల్లి జితేంద్ర, నోముల కృష్ణ పాల్గొన్నారు. నాయకులు గాలయ్య కి శాలువా కప్పి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పలువురు నేతలు, అధికారుల ప్రాముఖ్యత, సన్మానం పొందిన ఉద్యోగుల ప్రతిభను గుర్తిస్తూ, ఈ కార్యక్రమం ప్రజలలో సేవాభావన, ఉద్యోగ నిబద్ధతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి