Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:45 AM

*ఉపాధి హామీపై కేంద్రీకృత దాడి గ్రామీణ పేదలు తిరగబడాలి: జల్లెల పెంటయ్య

*ఉపాధి హామీపై కేంద్రీకృత దాడి గ్రామీణ పేదలు తిరగబడాలి: జల్లెల పెంటయ్య

*ఉపాధి హామీపై కేంద్రీకృత దాడి  గ్రామీణ పేదలు తిరగబడాలి: జల్లెల పెంటయ్య
February 02, 2026 07:07 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై గ్రామీణ ప్రజలు పోరుబాట పట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా కూల్చే ప్రయత్నాలకు కార్మికులు, రైతులు ఏకమవాలని స్పష్టం చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం–సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్–జి–రామ్–జి చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ వామపక్ష పార్టీల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం ద్వారా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రాల వాటాను పెంచడం వల్ల ఉపాధి కూలీలకు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కూలీలపై మరో భారం మోపుతూ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ధ్వంసం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని హెచ్చరించారు.తదనంతరం కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధి హామీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మాజీ వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, శానకొండ వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి జితేందర్, గోగు లింగస్వామి, నాగు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News