Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:34 AM

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా
February 20, 2026 06:46 PM 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి కూలీల సమస్యలపై పోరాటానికి పిలుపు

రామన్నపేట, : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను గ్రామీణ పేదలు తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి.రామ్ జి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్చి 2న రామన్నపేట ఎంపీడీవో కార్యాలయం ముందు నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ జనంపల్లి, కక్కిరేణి, ఇస్కిళ్ళ, దుబ్బాక గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చే ప్రయత్నం సరికాదన్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, కేంద్రం తన 90 శాతం వాటాను 60 శాతానికి తగ్గించుకోవడం ద్వారా బాధ్యత నుంచి తప్పుకుంటోందని విమర్శించారు.

చేసిన పనికి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కనీస వేతనం అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత విధానంలోనే చట్టాన్ని కొనసాగించి గ్రామీణ పేదలకు ఉపాధిని హామీ చేయాలని కోరారు.

మార్చి 2న జరిగే మహాధర్నాకు మండలంలోని వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హనుమంతు, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, గన్నేబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, పులి బిక్షమయ్య, గుండాల ప్రసాద్, గుండాల నరేష్, కన్నెబోయిన యాదయ్య, గట్టు గోపయ్య, పుట్టల ఉదయ్ కుమార్, కంబాలపల్లి మత్స్యగిరి, గట్టు రాజ్ కుమార్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News