PRINT TIME: March 20, 2026 04:52 PM
ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా
ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా
March 20, 2026 03:20 PM
42 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
శాసనసభ, శాసన మండలిలో పలువురు సభ్యులకు ప్రభుత్వ విప్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు ఈ హోదా దక్కింది.
శాసన మండలిలో తుంగతుర్తి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు.
తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా లభించడంతో ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ముగ్గురు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి