ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'
ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'
Editor Desk
నలభై నుంచి యాభై శాతం రాయితీపై రైతులకు సరఫరా
యాదాద్రి భువనగిరి:
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన యాంత్రికరణ విభాగంలో రైతులకు పలు వ్యవసాయ పరికరాలను నలభై నుంచి యాభై శాతం సబ్సిడీపై అందించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం పరిమితంగా ఉండటంతో ముందుగా దరఖాస్తు చేసిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పథకం కింద రైతులకు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మిని ట్రాక్టర్లు అందుబాటులో ఉంచారు. వర్గాల వారీగా పరికరాల కేటాయింపు ఇలా ఉంది.
పవర్ టిల్లర్లు
ఎస్టీ వర్గానికి ఒకటి, ఐదు ఎకరాలకు మించిన భూమి కలిగిన ఇతర రైతులకు మూడు.
పవర్ వీడర్లు
చిన్న సన్నకారు రైతులకు ఒకటి, ఎస్సీ వర్గానికి రెండు, పెద్ద రైతులకు మూడు.
బ్రష్ కట్టర్లు
చిన్న సన్నకారు రైతులకు నాలుగు, ఎస్సీ వర్గానికి ఐదు, ఎస్టీ వర్గానికి నాలుగు, పెద్ద రైతులకు ఐదు.
పవర్ స్ప్రేయర్లు
చిన్న సన్నకారు రైతులకు రెండు, ఎస్సీ వర్గానికి నాలుగు, పెద్ద రైతులకు పన్నెండు.
మిని ట్రాక్టర్లు
చిన్న సన్నకారు రైతులకు ఒకటి, ఎస్సీ వర్గానికి ఒకటి, ఎస్టీ వర్గానికి ఒకటి, పెద్ద రైతులకు ఒకటి.
ఆసక్తి గల రైతులు ఫిబ్రవరి పదో తేదీలోపు సంబంధిత ఉద్యాన అధికారిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
సంప్రదించాల్సిన వివరాలు
చౌటుప్పల్, బొమ్మలరామారం, వలిగొండ, రామన్నపేట, నారాయణపూర్, పోచంపల్లి, అడ్డగుడూర్, మోత్కూర్ మండలాల రైతులు – 8977714175
ఆత్మకూర్, గుండాల, మోటకొండూరు, ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బీబీనగర్ మండలాల రైతులు – 8977714176
భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల రైతులు – 8977714191
అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి