Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:32 PM

ఉద్యమకారులకు తీపి కబురు

ఉద్యమకారులకు తీపి కబురు

ఉద్యమకారులకు తీపి కబురు
February 20, 2026 08:26 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినట్లు చెప్పారు.

ఉద్యమకారుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ నెలలోనే ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని శుక్రవారం జరిగిన ప్రకటనలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు గత ఎనిమిది సంవత్సరాలుగా సాగించిన పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని జోగు అంజన్న తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యమకారుల కోరికలు త్వరలోనే నెరవేరనున్న నేపథ్యంలో, ఉద్యమకారులు అధైర్యపడకుండా తమ వద్ద ఉన్న ఆధారాలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News