Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:09 PM

ఉద్యమకారులకు తీపి కబురు

ఉద్యమకారులకు తీపి కబురు

ఉద్యమకారులకు తీపి కబురు
20-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినట్లు చెప్పారు.

ఉద్యమకారుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ నెలలోనే ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని శుక్రవారం జరిగిన ప్రకటనలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు గత ఎనిమిది సంవత్సరాలుగా సాగించిన పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని జోగు అంజన్న తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యమకారుల కోరికలు త్వరలోనే నెరవేరనున్న నేపథ్యంలో, ఉద్యమకారులు అధైర్యపడకుండా తమ వద్ద ఉన్న ఆధారాలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచించారు.

Sthanikam

ఉద్యమకారులకు తీపి కబురు

Article Image

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించినట్లు చెప్పారు.

ఉద్యమకారుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ నెలలోనే ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని శుక్రవారం జరిగిన ప్రకటనలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు గత ఎనిమిది సంవత్సరాలుగా సాగించిన పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని జోగు అంజన్న తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యమకారుల కోరికలు త్వరలోనే నెరవేరనున్న నేపథ్యంలో, ఉద్యమకారులు అధైర్యపడకుండా తమ వద్ద ఉన్న ఆధారాలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News