PRINT TIME: July 11, 2026 02:45 PM
ఉద్యమకారులకు ఇండ్లు.. సబ్కమిటీపై హర్షం సీఎంకు బొడ్డుపల్లి లింగయ్య కృతజ్ఞతలు.
ఉద్యమకారులకు ఇండ్లు.. సబ్కమిటీపై హర్షం సీఎంకు బొడ్డుపల్లి లింగయ్య కృతజ్ఞతలు.
February 21, 2026 05:56 PM
132 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు నెల రోజుల్లో సబ్కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. రామన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి