Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

ఉచిత కంటి వైద్యం, అద్దాల పంపిణి అభినందనీయం: యంపిడిఓ ఆవుల రాములు

ఉచిత కంటి వైద్యం, అద్దాల పంపిణి అభినందనీయం: యంపిడిఓ ఆవుల రాములు

ఉచిత కంటి వైద్యం, అద్దాల పంపిణి అభినందనీయం: యంపిడిఓ ఆవుల రాములు
February 05, 2026 05:37 PM 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కంటిచూపుకు కొత్త వెలుగు

గ్రామీణ పేదలకు ఉచిత కంటి వైద్యం ఆదర్శనీయం

గ్రామీణ పేదల కంటిచూపును తిరిగి అందించే ఉచిత కంటి వైద్య సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని మండల అభివృద్ధి అధికారి ఆవుల రాములు పేర్కొన్నారు. మునిపంపుల మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థం, ఆయన కుమారుడు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత అరవై రోజుల క్రితం నిర్వహించిన కంటి పరీక్షల్లో అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, ఆపరేషన్ పూర్తిచేసుకున్న వారికి భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం సమన్వయకర్త తలుపునూరి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆవుల రాములు మాట్లాడుతూ, సమస్య ఉన్నా వైద్యం చేయించుకునే స్థోమత లేక అనేక మంది గ్రామీణ పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదానికి నిదర్శనంగా సుమారు రెండు వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. అవగాహన లోపంతో వైద్య పరీక్షలకు కూడా దూరంగా ఉన్న ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.గ్రామ అభివృద్ధికి దేవిరెడ్డి కుటుంబం గత కాలం నుంచి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, ఎంపీఓ రఫుల్ అలీ, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, అఖిల పక్ష నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News