Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:42 AM

తిరుమల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

తిరుమల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

తిరుమల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం
January 20, 2026 08:44 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

APSRTC & TGRTC బస్సుల్లోనే శీఘ్ర దర్శనం టికెట్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) సంయుక్తంగా ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు వెయ్యి శీఘ్ర దర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీఎస్ఆర్టీసీ, టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి ప్రయాణించే భక్తులు రూ.300 అదనంగా చెల్లించడం ద్వారా బస్సులోనే తిరుమల తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యం ముఖ్యంగా లగ్జరీ, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుంది.ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం, అక్కడి ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు భక్తులకు దర్శన ప్రక్రియలో పూర్తిస్థాయి సహకారం అందిస్తారని వివరించారు.

ప్రస్తుతం APSRTC & TGRTC సంస్థలు తిరుపతికి రోజూ సుమారు 650 బస్సులను నడుపుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచీ తిరుపతికి బస్సు సౌకర్యం ఉండటంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి తదితర నగరాల నుంచి వచ్చే భక్తులకు ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా మారిందని అధికారులు తెలిపారు.కావున తిరుపతికి వెళ్లే భక్తులు ముందుగానే ఆర్టీసీ బస్సుల్లో దర్శనం టికెట్ పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News