Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 PM

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్
03-04-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


1). ముఖ్యంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.


2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.


3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.


4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.


ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Sthanikam

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

Article Image

హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


1). ముఖ్యంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.


2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.


3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.


4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.


ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News