Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎల్బీనగర్ వద్ద ఘోర ప్రమాదం: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్! రాజకీయాల్లో కొత్త మలుపు? జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 06:36 AM

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్
April 03, 2026 09:07 PM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


1). ముఖ్యంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.


2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.


3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.


4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.


ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News