Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:46 AM

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్
April 03, 2026 09:07 PM 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


1). ముఖ్యంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.


2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.


3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.


4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.


ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News