త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్
త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్
Editor Desk
హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
1). ముఖ్యంగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.
3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.
4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి