తమిళనాడు ఎస్సార్ గోపాల్కు హైదరాబాద్లో ఘన సన్మానం
తమిళనాడు ఎస్సార్ గోపాల్కు హైదరాబాద్లో ఘన సన్మానం
Editor Desk
తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్కు ఘన సన్మానం
హైదరాబాద్, స్థానిక ప్రతినిధి
హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ శనివారం హైదరాబాద్లో తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్ను సన్మానించారు. నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ సమీపంలోని ఫుడ్ కోర్టు హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సేవలపై విస్తృత చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ టీం చేపడుతున్న సేవలు, సామాజిక మార్పు కార్యక్రమాల గురించి డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ వివరించారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కిచెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ ఎస్సార్ గోపాల్ తెలిపారు. హైదరాబాద్లో ఈ భేటీ జరగడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కందికొండ గిరిజా, జిల్లా కమిటీ సభ్యులు భానోత్ చిట్టిబాబు, ఎం. నాగరాజు, ఎస్సార్ దొరస్వామి, బి. చంద్రయ్య, పరంధామం తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి