తాజ్పూర్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
తాజ్పూర్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ అనిల్ కుమార్ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత, పీడిత, బహుజన వర్గాల స్వేచ్ఛ, సమానత్వం కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పదని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి. నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబ్ యాకుబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి, బాల్రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచులు, కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి