తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఉదయం నుంచే వీస్తున్న వేడిగాలుల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు.
వైద్యులు అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని, ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తున్నారు. రైతులు, కూలీలు వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి