Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:20 AM

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం
December 24, 2025 09:18 PM 297 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల ప్రాణాలకు ముప్పు… ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో ప్రాణంబలి

స్థానికం ప్రతినిధి రామన్న పేట

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు, కోతుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ప్రాణాలే లక్ష్యంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనం.

నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి అంజయ్యపై సుమారు 20 రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ సనత్‌నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అంజయ్య మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గ్రామాల్లో వీధి కుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తుండగా, మరోవైపు కోతుల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. అయినా సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల నుంచి వీధి కుక్కలు, కోతులను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించకపోతే, ఇలాంటి ఘటనలు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News