Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం
December 24, 2025 09:18 PM 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల ప్రాణాలకు ముప్పు… ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో ప్రాణంబలి

స్థానికం ప్రతినిధి రామన్న పేట

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు, కోతుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ప్రాణాలే లక్ష్యంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనం.

నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి అంజయ్యపై సుమారు 20 రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ సనత్‌నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అంజయ్య మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గ్రామాల్లో వీధి కుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తుండగా, మరోవైపు కోతుల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. అయినా సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల నుంచి వీధి కుక్కలు, కోతులను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించకపోతే, ఇలాంటి ఘటనలు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News