Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:39 AM

తెలంగాణ అసెంబ్లీలో నేడు నీటి హక్కుల పెద్ద చర్చ

తెలంగాణ అసెంబ్లీలో నేడు నీటి హక్కుల పెద్ద చర్చ

తెలంగాణ అసెంబ్లీలో నేడు నీటి హక్కుల పెద్ద చర్చ
January 03, 2026 10:08 PM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

తెలంగాణ నీళ్లపై మాజీ సీఎం ద్రోహం: వేముల వీరేశం

చిట్యాల స్థానికం ప్రతినిధి పల్లపు ప్రశాంత్

తెలంగాణ రాష్ట్ర నీటి అంశాలపై శాసనసభలో జరిగిన చర్చలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని తలుచుకుంటే రామాయణం, మహాభారతం స్థాయిలో కథలున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని చెప్పే మాజీ ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలపై గద్దర్ వంటి కళాకారులు ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేస్తూ, తెలంగాణ ఏర్పడ్డాక జూరాల నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టుల రూపకల్పన ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నారు. దీని వల్ల మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తెలిపారు. బ్రహ్మణవెల్లెంల, శివన్నగూడెం వంటి ప్రాజెక్టులకు ఆనకట్టలు కట్టినా నీటి వనరు ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టత లేదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టి, తెలంగాణ నీటి హక్కులను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News