హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించి 7 రోజుల లోపుగా డీలర్లు వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్–20తో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించారు.
సమర్పించిన దరఖాస్తులను రెండు పని దినాల్లోగా పరిశీలించి ఆమోదించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి