Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ – రెండూ కాంగ్రెస్‌కే !

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ – రెండూ కాంగ్రెస్‌కే !

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ – రెండూ కాంగ్రెస్‌కే !
February 18, 2026 05:47 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీతో పాటు, బిఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది.


శాసనసభలో ప్రస్తుత పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుండి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో, ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. మజ్లిస్ కూడా మద్దతుగా ఉంటుంది.


ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 27 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఒక సీటు గెలవడానికి కూడా సరిపోదు. ఎనిమిది మమంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగ్ కు హాజరు కాకపోవచ్చు. పైగా, రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలోనూ అధికార పక్షానికే స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టినా పోటీ ఇవ్వడం కష్టమే. కాంగ్రెస్ అధిష్టానం ఒక సీటును జాతీయ స్థాయి నేతకు, మరో సీటును సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్ర స్థాయి నేతకు కేటాయించే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News