PRINT TIME: April 11, 2026 02:43 PM
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త
February 23, 2026 05:22 PM
267 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉద్యమకారులు దాఖలు చేసిన వినతిపత్రాన్ని న్యాయస్థానం విచారించింది. వాదనలు వినిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక తీర్పు వెలువరించారు. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ ఉద్యమకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి