Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:43 PM

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త
February 23, 2026 05:22 PM 267 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉద్యమకారులు దాఖలు చేసిన వినతిపత్రాన్ని న్యాయస్థానం విచారించింది. వాదనలు వినిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక తీర్పు వెలువరించారు. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ ఉద్యమకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News