తెలంగాణ సాహితీ దశాబ్ది వేడుకలు – నాగార్జున కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి
తెలంగాణ సాహితీ దశాబ్ది వేడుకలు – నాగార్జున కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి
స్థానికం బృందం
హైదరాబాద్లోని ఏ.వి. కళాశాల ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో నిర్వహించిన తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్య వేడుకల్లో నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచింది.
తెలంగాణ సాహితీ మరియు ఏ.వి. కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో “మాదకద్రవ్య రహిత సమాజం – సుస్థిర భవిష్యత్” అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నాగార్జున డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బి.ఎ. ప్రథమ సంవత్సరం విద్యార్థిని పెరుమాళ్ల నిశ్చల జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది.
మాదకద్రవ్యాల ప్రభావంపై సమాజంలో చైతన్యం కలిగించేలా ఆమె రాసిన వ్యాసం నిర్ణయక మండలిని ఆకట్టుకుంది. అనేక కళాశాలల నుంచి పాల్గొన్న విద్యార్థుల మధ్య నిశ్చల ఆలోచనా లోతు, భాషా నైపుణ్యం ప్రత్యేకంగా నిలిచాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు సాహిత్య, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం సమాజ నిర్మాణానికి అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కళాశాల తరఫున సంపూర్ణ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. మునిస్వామి, డా. బట్టు కిరీటం, డా. మల్లేశం, నర్సింగ్ కోటయ్య, హబీబ్, జాజుల దినేష్, కె. నాగరాజు, డా. అంకూస్, హస్రత్ బేగం, టంగుటూరి సైదులు, గోవర్ధన గిరి, ప్రభాకర్ తదితరులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి