రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ ఎంపిక
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన రాష్ట్ర కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పంతంగి వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి దశరథ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ కోరింది. రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి