తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
Biksham
64 స్థానాలు కైవసం – 36 చోట్ల తేలని తీర్పు
వార్డుల స్థాయిలోనూ కాంగ్రెస్ ఆధిక్యం
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ప్రధాన పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తేలని పరిస్థితి నెలకొంది. ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. బీజేపీ ఖాతా తెరవలేకపోయింది.వార్డుల స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 1,346 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 723 వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించగా, ఇతరులు 252 వార్డుల్లో గెలుపొందారు.ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిని మరింత బలపరుచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి