టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి
టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి
స్థానికం బృందం
టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి సర్వం సిద్ధం
వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా ఈ నెల 6న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చౌటుప్పల్ డివిజన్ యూనియన్ నాయకులు కునురు మహేష్ గౌడ్ సోమవారం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.1950 ఫిబ్రవరి 12న విజయవాడ కేంద్రంగా కేవలం ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన టీఈఈ యూనియన్, నేడు విద్యుత్ సంస్థల్లో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.ప్లాటినం జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని ఆయన వివరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి