Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:41 AM

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి
05-01-2026 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి సర్వం సిద్ధం

వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.


ఈ సందర్భంగా ఈ నెల 6న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చౌటుప్పల్ డివిజన్ యూనియన్ నాయకులు కునురు మహేష్ గౌడ్ సోమవారం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.1950 ఫిబ్రవరి 12న విజయవాడ కేంద్రంగా కేవలం ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన టీఈఈ యూనియన్, నేడు విద్యుత్ సంస్థల్లో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.ప్లాటినం జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని ఆయన వివరించారు.

Sthanikam

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి

Article Image

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి సర్వం సిద్ధం

వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.


ఈ సందర్భంగా ఈ నెల 6న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చౌటుప్పల్ డివిజన్ యూనియన్ నాయకులు కునురు మహేష్ గౌడ్ సోమవారం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.1950 ఫిబ్రవరి 12న విజయవాడ కేంద్రంగా కేవలం ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన టీఈఈ యూనియన్, నేడు విద్యుత్ సంస్థల్లో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.ప్లాటినం జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని ఆయన వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News