Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:55 PM

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి రేపు ఘన ప్రారంభం – హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి
January 05, 2026 07:31 PM 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీఈఈ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీకి సర్వం సిద్ధం

వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.


ఈ సందర్భంగా ఈ నెల 6న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చౌటుప్పల్ డివిజన్ యూనియన్ నాయకులు కునురు మహేష్ గౌడ్ సోమవారం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.1950 ఫిబ్రవరి 12న విజయవాడ కేంద్రంగా కేవలం ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన టీఈఈ యూనియన్, నేడు విద్యుత్ సంస్థల్లో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.ప్లాటినం జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని ఆయన వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News