Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:39 AM

స్వర్ణోత్సవాలపై సమీక్ష – భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు

స్వర్ణోత్సవాలపై సమీక్ష – భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు

స్వర్ణోత్సవాలపై సమీక్ష – భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు
January 11, 2026 02:23 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోపా అత్యవసర సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) అత్యవసర సమావేశం శనివారం నాగోల్‌లోని సుప్రజా హాస్పిటల్‌లో జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీతో పాటు అన్ని జిల్లా గోపా కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్లు హాజరయ్యారు.

డిసెంబర్ 26న నిర్వహించిన గోపా స్వర్ణోత్సవాల ఘన విజయంపై సక్సెస్ మీట్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణోత్సవాల నిర్వహణపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, సంస్థ భవిష్యత్ కార్యాచరణ, సంబంధాలు–బాంధవ్యాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో గోపా సభ్యులకు సుప్రజా హాస్పిటల్ అధినేత డాక్టర్ శిగ విజయ్ కుమార్ గౌడ్ కుటుంబ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా అన్ని వైద్య పరీక్షలపై, మొత్తం బిల్లుపై 30 శాతం రాయితీతో పాటు డాక్టర్ ఫీజు పూర్తిగా మాఫీ చేయనున్నట్లు తెలిపారు.అలాగే గోపా నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రాచమళ్ల అనిల్ కుమార్ గౌడ్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం విశేషంగా నిలిచింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… 50 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకున్న గోపా సంస్థ రాష్ట్ర గౌడ జాతికి గర్వకారణమన్నారు. గోపాను శక్తివంతమైన సామాజిక సంస్థగా తీర్చిదిద్దిన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కమిటీలను అభినందించారు. తన పదవీ కాలం ముగిసేలోగా కనీసం 5,000 మంది సభ్యులను చేర్చి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News