నగరంలో కొత్త వస్త్ర విక్రయ కేంద్రం ప్రారంభం – భారీగా తరలివచ్చిన ప్రజలు
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్తగా ఏర్పాటు చేసిన వస్త్ర విక్రయ కేంద్రాన్ని చిత్ర నటి వైష్ణవి చైతన్య ప్రారంభించారు. ఆమె రాకతో నగరంలో సందడి నెలకొంది. నటి ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అందులో ఉన్న చీరలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడి నాణ్యమైన చీరలను వినియోగదారులకు అందిస్తూ వారి అభిరుచికి అనుగుణంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అధిక ధరలతో లభించే చీరలను తక్కువ ధరలకు అందించడం మహిళలకు ఒక మంచి అవకాశం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విక్రయ కేంద్ర నిర్వహణ వర్గం మరియు ఇతరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి