Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:45 PM

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి
February 08, 2026 03:58 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

అభివృద్ధికి మరో ముందడుగు

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుభద్ర నగర్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కాలనీలో అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులతో సుభద్ర నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ స్వామి, సంక్షేమ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం, కొండయ్య, ఫణికుమార్, నర్సింహమూర్తి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహారావు, జీఎల్‌ఆర్ ప్రసాద్, నిర్మల, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్, ఇట్టబోయిన నర్సింహా, ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News