Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:03 PM

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి
February 08, 2026 03:58 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభివృద్ధికి మరో ముందడుగు

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుభద్ర నగర్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కాలనీలో అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులతో సుభద్ర నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ స్వామి, సంక్షేమ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం, కొండయ్య, ఫణికుమార్, నర్సింహమూర్తి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహారావు, జీఎల్‌ఆర్ ప్రసాద్, నిర్మల, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్, ఇట్టబోయిన నర్సింహా, ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News