Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి
08-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభివృద్ధికి మరో ముందడుగు

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుభద్ర నగర్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కాలనీలో అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులతో సుభద్ర నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ స్వామి, సంక్షేమ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం, కొండయ్య, ఫణికుమార్, నర్సింహమూర్తి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహారావు, జీఎల్‌ఆర్ ప్రసాద్, నిర్మల, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్, ఇట్టబోయిన నర్సింహా, ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుభద్ర నగర్‌లో సీసీ రోడ్ల ప్రారంభం.కళ్లెం నవజీవన్ రెడ్డి

Article Image

అభివృద్ధికి మరో ముందడుగు

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుభద్ర నగర్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కాలనీలో అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులతో సుభద్ర నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ స్వామి, సంక్షేమ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం, కొండయ్య, ఫణికుమార్, నర్సింహమూర్తి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహారావు, జీఎల్‌ఆర్ ప్రసాద్, నిర్మల, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్, ఇట్టబోయిన నర్సింహా, ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News