మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి