Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:18 PM

సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు శుభపరిణామం

సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు శుభపరిణామం

సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు శుభపరిణామం
February 04, 2026 02:46 PM 394 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంతేకూడ్లూరు గ్రామ ప్రజలు ఎన్నేళ్లుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శుభపరిణామం దక్కింది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై వేసవికాలం వచ్చిందంటే మూడు నెలల పాటు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడిన గ్రామానికి ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర దాహార్తిని అనుభవించినా అప్పటి గ్రామ నాయకులు సమస్య పరిష్కారంపై ఏమాత్రం చలనం చూపకుండా కాలం వెళ్లదీసారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది.అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా పసుపు సైనికులు ముందుకు వచ్చారు. 2018 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమ్మర్ స్టోరేజ్‌కు అనుమతి సాధించారు. కానీ అనంతరం వచ్చిన పాలకులు నాణ్యత లేకుండా పనులు చేసి, ఆ స్టోరేజ్‌ నుంచి గ్రామానికి త్రాగునీరు అందించే కనీస పైపులైన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. స్యాంక్షన్ జాబితాలో సమ్మర్ స్టోరేజ్ కోసం భూమి ఇచ్చిన గ్రామానికే నీటి పైప్ కనెక్షన్ లేకుండా ఉండటం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2025 జూలై నెలలో పసుపు సైనికులు గ్రామ సమస్యను రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ త్రాగునీటి సమస్యను వివరించగానే ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారు భరోసా ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారమే నేడు సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. సమ్మర్ స్టోరేజ్ నుంచి గ్రామ చెరువుకు, అక్కడి నుంచి ఓవర్ ట్యాంక్ వరకు నీటిని సరఫరా చేసే పైపులైన్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.ఈ పనులు సాధ్యమయ్యేందుకు అన్ని విధాలుగా సహకరించిన ఆదోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడికి గ్రామ ప్రజల తరఫున, పసుపు సైనికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నో సంవత్సరాలుగా వెంటాడిన త్రాగునీటి సమస్యకు పరిష్కారం దక్కనున్న ఈ శుభఘడియ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలవనుంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News