యాదాద్రి భువనగిరి జిల్లా:
సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగగా పేరుగాంచిన సంక్రాంతిని ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ రైతులకు సమృద్ధి, కార్మిక వర్గాలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు చేకూర్చాలని పరిటాల రవి ఆకాంక్షించారు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతూ తెలంగాణ అభివృద్ధి బాటలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని ఆయన పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి