Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు
February 23, 2026 08:30 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నిర్మల్ పట్టణంలోని పాత ఇన్‌స్పెక్షన్ బంగ్లా గోడపై చెక్కిన రెండు వేర్వేరు సంవత్సరాల నమోదు సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఒక వైపు 1930 క్రీస్తుశకం సంవత్సరం ఉండగా, మరో వైపు 1339 ఫస్లీ సంవత్సరం చెక్కబడి ఉండటం విశేషంగా నిలిచింది. ఈ సంఖ్యలు అప్పటి పరిపాలనా కాలమానాల వైవిధ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రీస్తుశకం కాలమానం పాశ్చాత్య గ్రెగోరియన్ విధానానికి చెందింది. అయితే గతంలో మొఘల్ పాలనలో ప్రవేశించిన ఫస్లీ కాలమానాన్ని తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం అధికారిక ఆదాయ సంవత్సరంగా అమలు చేసింది. రెవెన్యూ లెక్కలు, భూసంబంధిత రికార్డులు, జమాబందీ వ్యవహారాలు అన్నీ ఫస్లీ సంవత్సరాల ప్రకారమే నిర్వహించబడేవి.

‘ఫస్లీ’ అనే పదానికి ‘పంట’ అనే అర్థం ఉంది. అందువల్ల దీనిని వ్యవసాయ సంవత్సరంగా పరిగణించారు. ఫస్లీ సంవత్సరం జూలై 1న ప్రారంభమై తదుపరి ఏడాది జూన్ 30తో ముగుస్తుంది.

ఫస్లీ సంవత్సరానికి సాధారణంగా 590 సంవత్సరాలు కలిపితే క్రీస్తుశకం సంవత్సరం వస్తుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 1339 ఫస్లీకి 1929 సరిపోతుంది. అయితే ఫస్లీ సంవత్సరం రెండు క్రీస్తుశకం సంవత్సరాలకు వ్యాపించడంతో భవనంపై 1930గా నమోదు చేసినట్లు భావిస్తున్నారు.

తెలంగాణలోని పలు పాత ప్రభుత్వ భవనాలు, న్యాయస్థానాలు, రెవెన్యూ కార్యాలయాలపై ఇప్పటికీ ఫస్లీ సంవత్సరాల ముద్రలు కనిపిస్తుండటం ఆ కాలపు పరిపాలనా విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. పాత నిర్మాణాల గోడలపై చెక్కిన ఈ సంఖ్యలు ప్రాంత చరిత్రను మౌనంగా చెప్పుకుంటున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News