Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు
February 23, 2026 08:30 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నిర్మల్ పట్టణంలోని పాత ఇన్‌స్పెక్షన్ బంగ్లా గోడపై చెక్కిన రెండు వేర్వేరు సంవత్సరాల నమోదు సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఒక వైపు 1930 క్రీస్తుశకం సంవత్సరం ఉండగా, మరో వైపు 1339 ఫస్లీ సంవత్సరం చెక్కబడి ఉండటం విశేషంగా నిలిచింది. ఈ సంఖ్యలు అప్పటి పరిపాలనా కాలమానాల వైవిధ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రీస్తుశకం కాలమానం పాశ్చాత్య గ్రెగోరియన్ విధానానికి చెందింది. అయితే గతంలో మొఘల్ పాలనలో ప్రవేశించిన ఫస్లీ కాలమానాన్ని తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం అధికారిక ఆదాయ సంవత్సరంగా అమలు చేసింది. రెవెన్యూ లెక్కలు, భూసంబంధిత రికార్డులు, జమాబందీ వ్యవహారాలు అన్నీ ఫస్లీ సంవత్సరాల ప్రకారమే నిర్వహించబడేవి.

‘ఫస్లీ’ అనే పదానికి ‘పంట’ అనే అర్థం ఉంది. అందువల్ల దీనిని వ్యవసాయ సంవత్సరంగా పరిగణించారు. ఫస్లీ సంవత్సరం జూలై 1న ప్రారంభమై తదుపరి ఏడాది జూన్ 30తో ముగుస్తుంది.

ఫస్లీ సంవత్సరానికి సాధారణంగా 590 సంవత్సరాలు కలిపితే క్రీస్తుశకం సంవత్సరం వస్తుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 1339 ఫస్లీకి 1929 సరిపోతుంది. అయితే ఫస్లీ సంవత్సరం రెండు క్రీస్తుశకం సంవత్సరాలకు వ్యాపించడంతో భవనంపై 1930గా నమోదు చేసినట్లు భావిస్తున్నారు.

తెలంగాణలోని పలు పాత ప్రభుత్వ భవనాలు, న్యాయస్థానాలు, రెవెన్యూ కార్యాలయాలపై ఇప్పటికీ ఫస్లీ సంవత్సరాల ముద్రలు కనిపిస్తుండటం ఆ కాలపు పరిపాలనా విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. పాత నిర్మాణాల గోడలపై చెక్కిన ఈ సంఖ్యలు ప్రాంత చరిత్రను మౌనంగా చెప్పుకుంటున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News