న్యాల్కల్,
న్యాల్కల్ మండల పరిధిలోని ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై హద్నూర్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్ఐ సుజిత్ తెలిపారు.పోలీసులు సాధారణ వ్యక్తుల్లా అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని గమనించి, ఒక్కసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ, మండలంలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి