సిరిపురంలో ఉచిత వైద్య శిబిరం – గ్రామీణులకు అందిన ఆరోగ్య సేవలు
సిరిపురంలో ఉచిత వైద్య శిబిరం – గ్రామీణులకు అందిన ఆరోగ్య సేవలు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే దిశగా బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మమత హాస్పిటల్, బాచుపల్లి–హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు రోగుల ఆరోగ్య సమస్యలను సమగ్రంగా పరిశీలించి తగిన సూచనలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, పంచాయతీ కార్యదర్శి ఎం. జ్యోతి, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, పున్న వెంకటేశం, పగడాల లక్ష్మి, గుంటోజు కృష్ణమాచారి, సంగీశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి