Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:36 PM

సిరిపురం ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ

సిరిపురం ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ

సిరిపురం ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ
February 07, 2026 11:58 AM 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం:

సిరిపురం గ్రామానికి చెందిన మిత్రులు, గ్రామ వాసులు పున్న మల్లేశం నేత రూపొందించిన వినూత్న వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ శుభ సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం,భాగ్యలక్ష్మిలను ఘనంగా సన్మానించారు.ఒకేసారి 176 దేశాలకు సంబంధించిన సమయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించే వరల్డ్ క్లాక్ రూపకల్పన సిరిపురం గ్రామానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిన మధుర ఘట్టంగా నిలిచింది. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి చేరిన ఈ ఆవిష్కరణ అందరి మన్ననలను పొందింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత మాట్లాడుతూ, మల్లేశం రూపొందించిన వరల్డ్ క్లాక్ అత్యంత అరుదైన, వినూత్న ఆలోచనకు నిదర్శనమని ప్రశంసించారు. ఒకే చోట ప్రపంచ దేశాల సమయాన్ని తెలుసుకునే విధంగా రూపొందించిన ఈ ఆవిష్కరణ నిజంగా అభినందనీయమని అన్నారు.ఇంతకుముందు మల్లేశం రూపొందించిన కలియుగ క్యాలెండర్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెంట్ సంస్థల నుంచి ప్రశంసాపత్రాలు లభించడం సిరిపురం గ్రామానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మల్లేశం మేధస్సు మరిన్ని వినూత్న పరిశోధనలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News