సిరిపురంలో శివపార్వతుల కళ్యాణం వైభవం… భక్తులతో కళకళలాడిన దేవస్థానం
సిరిపురంలో శివపార్వతుల కళ్యాణం వైభవం… భక్తులతో కళకళలాడిన దేవస్థానం
స్థానికం బృందం
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం లో సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నినాదాల మధ్య నిర్వహించిన ఈ దివ్య కార్యక్రమం గ్రామాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తింది.
ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు రుద్ర నవగ్రహ పూజలు, హోమాలు, 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకంతో శాస్త్రోక్తంగా కొనసాగాయి. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు.
కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి సమర్పించగా, పట్టు వస్త్రాలను సిరిపురం చేనేత సహకార సంఘం సమర్పించింది. భారీ ఊరేగింపు మధ్య స్వామివారి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కళ్యాణ మండపానికి తీసుకువచ్చిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనూష రమేష్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీతారామాంజనేయ స్వామి చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ సర్పంచులు, ధర్మకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి