Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:30 AM

సిరిపురంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా

సిరిపురంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా

సిరిపురంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా
February 18, 2026 04:07 PM 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రథోత్సవంలో గ్రామం మొత్తం శివనామస్మరణతో మారుమోగిన వేడుకలు

సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

సాయంత్రం 5.15 గంటలకు హోమం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి విగ్రహాలను అలంకరించిన రథంపై గ్రామ పురవీధులలో ఊరేగించారు. డప్పుసప్పులు, భజనలు, కోలాటాలతో గ్రామం అంతా శివనామస్మరణతో మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వామివారిని స్వాగతించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మూడు గుడ్ల అనుషా రమేష్, దేవస్థానం చైర్మన్ శ్రీరాపోలు రమేష్, ధర్మకర్తలు సూదిని చంద్రారెడ్డి, బలుగూరి లింగస్వామి, కొంగరి జంగయ్య, మామిడి చందన, దంతూరి యాదగిరి, సింగం నరసింహ, రాపోలు అమరేందర్, పున్న విష్ణుమూర్తి పాల్గొన్నారు.

అలాగే సీతారామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ చైర్మన్ రాపోలు స్వామి, కొంగరి వెంకటేశం, తుంగ మార్కయ్య, మొగిలి శ్రీనివాసు, శివాలయం మాజీ చైర్మన్ పున్న శేషాద్రి, భజన మండలి చైర్మన్ చేపూరి సత్యనారాయణ, బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు రమేష్, మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్, పున్న వెంకటేశం, వార్డు సభ్యులు గాదె యాదయ్య, కంకల అర్చన, మల్లేశం, మామిడి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News