Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:43 AM

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి
February 18, 2026 04:10 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

పిఎసిఎస్ కేంద్రాల ద్వారా పారదర్శక పంపిణీ చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలో రైతులకు అవసరమైన మేర యూరియా ఎరువు అందుబాటులో ఉంచి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) కేంద్రాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను అయోమయానికి గురిచేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.

సిపిఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ లాల్ బహుదూర్ కు, మండల వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ, యూరియా విక్రయాన్ని యాప్‌కు పరిమితం చేయడంతో డీలర్లకు సమీపంలో ఉన్న రైతులకే సరఫరా జరుగుతుందని, చిన్న మరియు సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో సుమారు 15 వేల యూరియా బస్తాల అవసరం ఉందని, కలుపు తీసే వ్యవధి ముగియబోతున్నందున వచ్చే పది రోజుల్లో యూరియా అత్యవసరమవుతుందని పేర్కొన్నారు. అధికారులు తక్షణం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని, సింగిల్ విండో కేంద్రాల ద్వారా సరఫరా చేసి పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను వివరించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, కల్లూరి నాగేష్, కందుల హనుమంతు, గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, శానకొండ రామచంద్రం, పల్లె సత్యం, వేముల మల్లేశం, కన్నెబోయిన రాజాలింగం, తాటిపాముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News