Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:28 PM

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి
February 18, 2026 04:10 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

పిఎసిఎస్ కేంద్రాల ద్వారా పారదర్శక పంపిణీ చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలో రైతులకు అవసరమైన మేర యూరియా ఎరువు అందుబాటులో ఉంచి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) కేంద్రాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను అయోమయానికి గురిచేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.

సిపిఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ లాల్ బహుదూర్ కు, మండల వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ, యూరియా విక్రయాన్ని యాప్‌కు పరిమితం చేయడంతో డీలర్లకు సమీపంలో ఉన్న రైతులకే సరఫరా జరుగుతుందని, చిన్న మరియు సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో సుమారు 15 వేల యూరియా బస్తాల అవసరం ఉందని, కలుపు తీసే వ్యవధి ముగియబోతున్నందున వచ్చే పది రోజుల్లో యూరియా అత్యవసరమవుతుందని పేర్కొన్నారు. అధికారులు తక్షణం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని, సింగిల్ విండో కేంద్రాల ద్వారా సరఫరా చేసి పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను వివరించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, కల్లూరి నాగేష్, కందుల హనుమంతు, గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, శానకొండ రామచంద్రం, పల్లె సత్యం, వేముల మల్లేశం, కన్నెబోయిన రాజాలింగం, తాటిపాముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News