PRINT TIME: February 23, 2026 05:09 PM
శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
February 22, 2026 04:26 PM
226 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రజలతో సన్నిహితంగా మమేకమవుతూ కుటుంబ వేడుకల్లో పాల్గొన్నారు.
రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గోగు సత్తయ్య కుమారుడి వివాహ విందుకు హాజరైన ఆయన, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు.
అనంతరం నార్కెట్పల్లి పట్టణంలో నిర్వహించిన నిశ్చితార్థ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొంబాయి నర్సింహ కుమారుడి నిశ్చితార్థంతో పాటు మేకల గోపాల్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని జంటలకు ఆశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఆనందాల్లో భాగస్వామ్యం కావడం తనకు సంతోషంగా ఉంటుందని చిరుమర్తి లింగయ్య తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి