శంకర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు శుభారంభం… ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ
శంకర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు శుభారంభం… ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం:
గ్రామ దైవమైన శ్రీ ఇంద్రపాల శంకర్ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆహ్వాన గోడ పత్రికను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శుక్రవారం ఆవిష్కరించారు. శంకర్ గుట్టపై నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా శివరాత్రి పర్వదినాన తేది 15 ఫిబ్రవరి రాత్రి 11 గంటల 40 నిమిషాలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ విక్రమ్ వెల్లడించారు. గ్రామ ఐక్యత, భక్తి భావన ప్రతిబింబించేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగణబోయిన పాండరి యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, మందడి విద్యాసాగర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రేపాక సత్తయ్య, రవ్వ నరసింహ, సింగణబోయిన జంగయ్య, శ్రీశైలం, సత్యనారాయణ, దాసు, వీర్లపల్లి మల్లయ్య, రాజన్నగారి రమేష్, తౌటమ్ శంకరయ్య, గర్ధాస్ వెంకటేశం, కన్నయ్య, పద్మారావు, కొలుకుల పెళ్లి యాదయ్య, బాజా నరేందర్, గునిగంటి రామలింగం, మర్రి యాదయ్య, వెంకటేశం, సత్తయ్య, శంకర్, జిట్టబోయిన వెంకటేశం, నక్క వెంకటేష్, గండు ఆంజనేయులు, కంబాలపల్లి శ్రీశైలం, మర్రి మహేష్, కోటపల్లి మహేష్, బోనగిరి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి