శివరాత్రికి ముందే చర్యలు… శంకర్గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు
శివరాత్రికి ముందే చర్యలు… శంకర్గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. శంకర్గుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన కంప చెట్లను తొలగిస్తూ, శిథిలమైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించింది.
సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పనుల్లో ఉపసర్పంచి నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, కప్పల మంగమ్మ రాజు చురుకుగా పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సింగన బోయిన గణేష్ యాదవ్, సింగన బోయిన సత్యనారాయణ యాదవ్, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు నక్క వెంకటేశం, సింగన బోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం, గర్ధాస్ కరుణాకర్, వడ్లకొండ కిరణ్, పాలమాకుల మల్లేష్, గర్ధాస్ శ్రీకాంత్, బాలు, ఈర్లపల్లి రమేష్, వెలిమినేటి నరేష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి