Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:37 PM

శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు

శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు

శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు
April 13, 2026 07:26 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్‌తో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల చైర్మన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ మధిర మల్లేశం మాట్లాడుతూ, భువనగిరి పట్టణంలోనే అత్యధిక మార్కులను సాధించి శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. ఐపీఈతో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో అన్ని సౌకర్యాలతో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ వసతిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభ వివరాలు:

ద్వితీయ సంవత్సరం:

ఎంపీసీ: అభిరామ్ – 992/1000, భవ్య శ్రీ – 998/1000

బైపీసీ: అను – 990/1000, శిరీష – 986/1000

సీఈసీ: కీర్తన – 964/1000, శివాని – 963/1000

ప్రథమ సంవత్సరం:

ఎంపీసీ: ఇవాంజియల్ – 466/470, అపూర్వ, హర్షిత – 465/470

బైపీసీ: తేజశ్రీ, కారుణ్య – 463/440, శ్రీ వర్షిని – 434/440

సీఈసీ: ఫాతిమా – 488/500

ఎంఈసీ: అక్షర – 486/500

విద్యార్థుల ఈ అద్భుత ఫలితాలతో కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News