శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు
శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు
Editor Desk
భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్తో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల చైర్మన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ మధిర మల్లేశం మాట్లాడుతూ, భువనగిరి పట్టణంలోనే అత్యధిక మార్కులను సాధించి శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. ఐపీఈతో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో అన్ని సౌకర్యాలతో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ వసతిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభ వివరాలు:
ద్వితీయ సంవత్సరం:
ఎంపీసీ: అభిరామ్ – 992/1000, భవ్య శ్రీ – 998/1000
బైపీసీ: అను – 990/1000, శిరీష – 986/1000
సీఈసీ: కీర్తన – 964/1000, శివాని – 963/1000
ప్రథమ సంవత్సరం:
ఎంపీసీ: ఇవాంజియల్ – 466/470, అపూర్వ, హర్షిత – 465/470
బైపీసీ: తేజశ్రీ, కారుణ్య – 463/440, శ్రీ వర్షిని – 434/440
సీఈసీ: ఫాతిమా – 488/500
ఎంఈసీ: అక్షర – 486/500
విద్యార్థుల ఈ అద్భుత ఫలితాలతో కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి