Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:11 PM

శ్రీవారి భక్తులు రెడీనా? ఈ నెల 18 నుంచే మార్చి కోటా టికెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

శ్రీవారి భక్తులు రెడీనా? ఈ నెల 18 నుంచే మార్చి కోటా టికెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

శ్రీవారి భక్తులు రెడీనా? ఈ నెల 18 నుంచే మార్చి కోటా టికెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
December 17, 2025 08:58 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి, తిరుమల:

​తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. లక్కీ డిప్ ద్వారా కేటాయించే ఈ సేవల కోసం భక్తులు ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

​ఇతర సేవల టికెట్ల విడుదల వివరాలు:

  1. 22న ఉదయం 10 గంటలకు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు విడుదల చేస్తారు.
  2. 23న ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
  3. 23న ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదలవుతుంది.
  4. 23న మధ్యాహ్నం 3 గంటలకు: వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు విడుదల చేస్తారు.
  5. 24న ఉదయం 10 గంటలకు: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
  6. 24న మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ (అకామిడేషన్) కోటాను విడుదల చేస్తారు.

​భక్తులు అధికారిక వెబ్‌సైట్ [https://ttdevasthanams.ap.gov.in/]లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News