PRINT TIME: February 24, 2026 01:09 AM
శ్రీవారి భక్తులు రెడీనా? ఈ నెల 18 నుంచే మార్చి కోటా టికెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
శ్రీవారి భక్తులు రెడీనా? ఈ నెల 18 నుంచే మార్చి కోటా టికెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
December 17, 2025 08:58 PM
38 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి, తిరుమల:
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. లక్కీ డిప్ ద్వారా కేటాయించే ఈ సేవల కోసం భక్తులు ఈ నెల 20 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర సేవల టికెట్ల విడుదల వివరాలు:
- 22న ఉదయం 10 గంటలకు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు విడుదల చేస్తారు.
- 23న ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
- 23న ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదలవుతుంది.
- 23న మధ్యాహ్నం 3 గంటలకు: వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు విడుదల చేస్తారు.
- 24న ఉదయం 10 గంటలకు: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
- 24న మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ (అకామిడేషన్) కోటాను విడుదల చేస్తారు.
భక్తులు అధికారిక వెబ్సైట్ [https://ttdevasthanams.ap.gov.in/]లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి