శ్రీశైలం నిత్య అన్నదాన సత్రంలో వెల్లంకి సర్పంచ్కు సన్మానం
శ్రీశైలం నిత్య అన్నదాన సత్రంలో వెల్లంకి సర్పంచ్కు సన్మానం
Editor Desk
తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతినిధి
కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న అఖిల భారత పద్మశాలి నిత్య అన్నదాన సత్రంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ఇడెం రాధ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.
శ్రీశైల నిత్య అన్నదాన సత్రం అధ్యక్షుడు కర్నాటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏలే యాదయ్య, చిలువేరు పండరీనాధ్, రావిరాల చిన్నవీరయ్యతో పాటు నిత్య అన్నదాన సత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాసేవతో పాటు ధార్మిక కార్యక్రమాలకు నిత్య అన్నదాన సత్రం అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని పాల్గొన్నవారు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి