Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:04 PM

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ
February 07, 2026 04:50 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారులు, భవనం, బోర్‌వెల్‌కు గ్రీన్ సిగ్నల్

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శక్తి నగర్ కాలనీ సమస్యలపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. కాలనీలో ఇప్పటికే మంజూరైన రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలని, వెల్ఫేర్ సొసైటీ భవన మొదటి అంతస్తు నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటు అంశాలను సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రహదారి పనులు త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సొసైటీ భవన నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండనివ్వబోమని తెలిపారు.ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, శక్తి నగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఖాదర్, ఖజానాదారు కిష్టయ్యతో పాటు మహాలింగం, నాయిని రాం రెడ్డి, సుభాష్ రెడ్డి, వంగల రాం రెడ్డి, గంజి కృష్ణ, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదగిరి రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News