Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:48 PM

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ
February 07, 2026 04:50 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రహదారులు, భవనం, బోర్‌వెల్‌కు గ్రీన్ సిగ్నల్

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శక్తి నగర్ కాలనీ సమస్యలపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. కాలనీలో ఇప్పటికే మంజూరైన రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలని, వెల్ఫేర్ సొసైటీ భవన మొదటి అంతస్తు నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటు అంశాలను సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రహదారి పనులు త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సొసైటీ భవన నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండనివ్వబోమని తెలిపారు.ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, శక్తి నగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఖాదర్, ఖజానాదారు కిష్టయ్యతో పాటు మహాలింగం, నాయిని రాం రెడ్డి, సుభాష్ రెడ్డి, వంగల రాం రెడ్డి, గంజి కృష్ణ, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదగిరి రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News