సీపీఐ వందేళ్ల ఉత్సవాలకు మద్దతుగా ఆదోనిలో జనవరి 16న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ఆదోని, జనవరి 12: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన
సీపీఐ వందేళ్ల ఉత్సవాలకు మద్దతుగా ఆదోనిలో జనవరి 16న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ఆదోని, జనవరి 12: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన
Editor Desk
ఆదోని, జనవరి 12:
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా, జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తు కార్యక్రమంగా ఆదోని పట్టణంలో జనవరి 16న ర్యాలీతో పాటు పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నట్లు సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కే. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన సీపీఐ నాయకులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అంటించేందుకు రూపొందించిన స్టిక్కర్లను సోమవారం విడుదల చేశారు. ఈ స్టిక్కర్ల ద్వారా సీపీఐ వందేళ్ల పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఖమ్మం బహిరంగ సభకు విస్తృత మద్దతు సమీకరించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, యువత, సామాన్య ప్రజల హక్కుల కోసం సీపీఐ వందేళ్లుగా సాగిస్తున్న నిరంతర పోరాటాలకు ప్రతీకగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 16న ఆదోనిలో జరగనున్న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో AiYF పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, శాఖ కార్యదర్శి విజయ్, ఆటో యూనియన్ నాయకులు నరసింహులు, శ్రీరాములు, భాషా షేక్షావలి, నాగరాజు, వరప్రసాద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి