లబ్ధిదారునికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజే
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణంలో లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ ఉప చైర్మన్ ఎం డి షఫీ ఉల్లా, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి కలిసి చెక్కును లబ్ధిదారునికి అందించారు.అన్నాదురై నగర్కు చెందిన శ్రీనివాస్ మర్రికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి